4, అక్టోబర్ 2011, మంగళవారం

ఆర్య -ద్రవిడ -3 (లేమురియా, కుమారి ఖండం)



ఇంతకు ముందు రాసిన సుత్తిలోని మొదటి భాగంరెండవ భాగం..తర్వాత ఇది మూడవ భాగం

ద్రవిడులు అసలు స్థానికులేనా అనే కదా.. ప్రశ్న వచ్చిందీ..!

కాదని నేనక్కర్లేదు...! కొంతమంది  "ద్రవిడ జాతి" వాదులే అన్నారు..!

ఆ మధ్యనెప్పుడో "తమిళ-తెలుగు" తన్నులాటలని చూసాను. అందులో ఒక్క తెలుగువాడు మిగిలిన తమిళంవాళ్ళనందరినీ చీల్చిచెండాడేస్తున్నాడు. "తమిళనాడు" పేరు హాస్యాస్పదమనీఅసలు "తెలుగు నాడు"అనేదే ఉండవలసిన పేరనీ సాగిపోతూండగామధ్యలో ఎవడో తెలుగువాళ్లని "ఉత్తరదిశ" నుండి వచ్చితమ భూభాగాలని ఆక్రమిచారన్నట్టుగా అన్నాడు. దానికీ తెలుగతను తమిళం వాళ్లసలు భారతీయులే కాదనీ, "లేమురియా"..అనే ఖండం నుండి వచ్చారని అన్నాడు.. ఆ తర్వాత డిస్కషన్‌ జ్ఞాపకం లేదు.. అసలీ "లేమురియా"..అంటే ఏంటో చూద్దాం ముందు..!

లేమురియా కూడా "అట్లాంటిస్‌"లాగే సముద్రంలోకి వెళ్ళిపోయిన భూఖండం (కొంతసేపు నిజం అనుకుందాం..!) 1864లో ఫిలిప్‌ స్క్లాటర్‌ అనే అసామి, "mammals of Madagascar" ...అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించాడు. అతనికి మడగాస్కర్‌భారతదేశంలో లభించిన కొన్ని శిలాజాలుఆఫ్రికా ఖండంలో దొరకలేదట.! అందువల్ల భారతదేశంమడగాస్కర్‌ ఒకప్పుడు ఒకే పెద్ద ఖండంలో ఉండి ఉండవచ్చని భావించాడు. (అవి క్షీరదాలు..! క్షీరదాలు భూమ్మీద పుట్టే సమయానికిమన భూమి సుమారు ఇప్పుడున్నట్టుగానే ఉంది..! ఇదీ ఎక్కడో చదివాను)


దీనికి సంబంధించిన వర్ణనలు తమిళ "సంగమ" సాహిత్యంలో ఉన్నాయట..! దీన్ని అందులో "కుమారి ఖండం"..అని పిలిచేవారట..! "కలిత్తోకై", "శిలప్పధికారం"లలో కొన్ని చోట్ల వాటి గురించి ప్రస్తావనవర్ణనలూ వచ్చాయట..! కన్యాకుమారికి దక్షిణంగా కొన్ని వందల మైళ్ళ మేర వ్యాపించి ఉండేదట..! "క్రూరమైన సముద్రం"..కన్యాకుమారిపహరౌలి నదికి మధ్యగా ఉన్న పాండ్యుల భూమిని లాక్కొనగాఆ పాండ్యులు చేరచోళ రాజుల భూభాగాలను ఆక్రమించాడట..! "పహరౌలీ", "కుమారి"..అనే నదులుఆ మునిగిపోయిన భూఖండంలో ప్రవహించేవట..!

ఇంతవరకూ బానే ఉంది..! అయితే, 1992లో ఆర్‌. మతినవన్‌ అనే ఆసామి ద్రవిడుల కాలరేఖ ఈ క్రింది విధంగా రాసాడు.. పూర్తి వివరాలు ఈ వికీపీడియావ్యాసంలో
//            ca. 200,000 to 50,000 BC: evolution of "the Tamilian or Homo Dravida",
ca. 200,000 to 100,000 BC: beginnings of the Tamil language
50,000 BC: Kumari Kandam civilisation
20,000 BC: A lost Tamil culture of the Easter Island which had an advanced civilisation
16,000 BC: Lemuria submerged
6087 BC: Second Tamil Sangam established by a Pandya king
3031 BC: A Chera prince in his wanderings in the Solomon Island saw wild sugarcane and started cultivation in Kumari Kandam.
1780 BC: The Third Tamil Sangam established by a Pandya king
7th century BC: Tolkappiyam (the earliest known extant Tamil grammar)//

            అయితేదీన్ని ఎవరూ ఒప్పుకోవడం లేదు..! మరీ క్రీ.పూ. 50 వేల సంవత్సరం దగ్గర నాగరికత అంటేనమ్మబుద్ధికావడం లేదుగానీఏదో 3,4 వేల సంవత్సరాల కిందనైతే నమ్మవచ్చేమో..! (అది కూడా పూర్తి ఆధారాలతో)..కొంతసేపు ఇది నిజమని అనుకుంటే, "ద్రవిడులు"..స్థానికులు ఎలా అయ్యారన్నదే నా అనుమానం..! "కుమారి ఖండం".. తప్పయితే.. సంగం సాహిత్యం..మీద కూడా గురిపెట్టాల్సొస్తుందేమో..! ఆర్యులు వచ్చి ద్రవిడులను తరిమేసినట్టుగా లేదుకదా..! కేవలం ద్రవిడులే భారతదేశానికొచ్చి చేరచోళ భూభాగాలను ఆక్రమించుకున్నట్టుగా ఉందిగా..! దీని మీద పరిశోధనలు చేయాలి.. (ముఖ్యంగా తమిళుల పరిశోధనను ఇక్కడ అస్సలు నమ్మకూడదు..!)

            మళ్లీ మనం "భవిష్య పురాణం" దగ్గరకి వద్దాం..! ముందు దాని ప్రామాణికత మీదే అనుమానపడ్డాను కదా..! దాని ప్రామాణికతను సమర్థించేది నిజంగా జరిగినజరుగుతున్న చరిత్రే..! పృథ్వీరాజుజయచంద్రుల గురించీతైమూర్‌ లంగ్‌ భారతదేశ దండయాత్ర గురించీబాబరూఅక్బరూఔరంగజేబుతదితర మొగలాయిల గురించీశివాజీ గురించీబ్రిటీషువారి పరిపాలన గురించీ రాసి ఉంది..సంవత్సరాలతో సహా..! (పోనీ దీన్ని కూడా ఎవడో ఎక్కించాడనుకుందాం..!) బ్రిటీషువాళ్ల తర్వాత మౌనులు భారతదేశాన్ని పరిపాలిస్తారని కూడా ఉంది..(స్వాతంత్ర్యం గురించి లేదు మరి..!) ఈ మౌనులెవర్రా అంటేబౌద్ధధర్మపరాయణులటహిమాలయవాసులటభభ్రువర్ణులట..ఇలా వర్ణనలున్నాయి. వీళ్లు టిబెట్‌ వాళ్లైనా కావచ్చుచైనా వాళ్లైనా కావచ్చు. "మౌన"..శబ్దం.. "మావో"..లతో కలుస్తోందని నా ఉద్దేశ్యం. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. భవిష్య పురాణం కరెక్టోకాదో..!
            సరే..! మరి సంస్కృతానికీలాటిన్‌కీ ఉన్న సంబంధం మాటేమిటి..?
(ఇంకా ఉంది నా చేటభారతం)

1 కామెంట్‌:

  1. vamana geeta garu, prachina tamil grandhalu enno unnaayi. vaatini pariseelanaloki tisukokundaa AIT siddhantam vadanalaki saripodu. sare sashesham annaaru kabatti na comment kudaa sasheshame.

    రిప్లయితొలగించండి