24, మార్చి 2010, బుధవారం

రామ సేతు

రామ సేతు ను దేశ భద్రతాకారణాల దృష్ట్యా కూల్చాలని కేంద్రం తలపోయడం వివాదాస్పదం ఐన సంగతి అందరికి తెల్శిందే....
కాని ఇక్కడ పరిశీలించవలసిన విషయం ఏంటంటే....తాము అభ్యుదయవాదులమని అని ప్రకటించుకొనే వాళ్ళందరూ..
సమయం దొరికింది కదా అని అదే పనిగా రామున్ని అవమానిచడం...సభ్యత అనిపించుకోదు...
రాముడా? అతనెవరు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎ విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ చదివాడు? లాంటి అర్థం పర్థం లేని ప్రశ్నలు సంధించడం... వాళ్ళ దివాలకోరుతనాన్ని సూచిస్తోంది....దేశంలో అత్యదిక సంఖ్యాకులకి ఆర్ధ్య దైవమైన రాముడికి చెప్పుల దండలు వేసినవాళ్ళకి ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు రావడం వింతేమీ కాదు....
కేంద్రం కూడా వాదనల్లో ప్రజల మనోభావాలని కించపరిచేలా వ్యవహరించడం బాధాకరం
.... చివరకి అఫిడవిట్ ను ఉపసంహరించు కోవడం ఆనందపరిచింది.....

దేశ భద్రతే లక్ష్యంగా చిత్తశుద్ధితో కేంద్రం వ్యవహరించి ఉంటే...ఇంత రగడ జరిగేది కాదు....బహుశా.రాముడే ఇపుడు ఉంది ఉంటే ఆ ప్రాజెక్ట్ కి అనుమతించి వుండే వాడు....ప్రజలు నిండు మనసుతో స్వాగతించే వాళ్ళు....
కాని కేంద్రం రాముడే లేదని వాదించింది....చారిత్రక అధరాలు లేవంది...
ఇక్కడ ఒక గుర్తు చేసుకోవాలి.....మన చదువుకొన్న మన చరిత్ర...మనం రాసుకొంది కాదు....ఇంగ్లీష్ వాళ్ళు రాసింది...!
ఎవడో బయటి వాడు చెప్పింది చదువుకొని మనల్ని మనమే కించపరుచుకొంటున్నాం... కొట్టుకుంటున్నాం....


'అవతార్' సినిమా లో గాలిలో తేలే రాళ్ళు ఉంటాయటే నమ్మే మనం సముద్రం మీద రాళ్ళూ తేలతాయంటే నమ్మడం ledu ...

ఇప్పటికైనా మన నాయకులు ప్రజల్లో ఉన్న ఆత్మ న్యూనతా bhaavanni tholaginchadani ప్రయత్నిస్తే మంచిది....