పనిలేక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పనిలేక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, అక్టోబర్ 2011, శుక్రవారం

జనాభాపరంగా పెద్ద నగరాలు ఇవట..!



           భారత జనగణన సంఘంవారి వెబ్‌సైట్‌లోని నగరాల 2011 జనాభా లెక్కల వివరాలు చూసి రాస్తున్న పోస్టిది..! చిన్నప్పట్నుంచీ, ఆ ఊరు పెద్దదా..? ఈ ఊరు పెద్దదా..? అనే పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని. ఇప్పటికీ ఉన్న ఆ వెర్రి కారణంగా ఈ పోస్ట్‌ రాస్తున్నాను..   భారత జనగణన సంఘంవారి వెబ్‌సైట్‌ లింకిదిగో.. ఇంకేమన్నా వివరాలు కావాలంటే వెళ్లి చూస్కోండి..!

                                                                                              
నగరం
జనాభా
ముంబయి (Mumbai)
18,414,288
దిల్లీ (Delhi)
16,314,838
కోల్‌కత (Kolkata)
14,112,536
చెన్నై (Chennai)
8,696,010
బెంగుళూరు (Bengaluru)
8,499,399
హైదరాబాద్‌ (Hyderabad)
7,749,334
అహ్మదాబాద్‌ (Ahmadabad)
6,352,254
పూణే (Pune)
5,049,968
సూరత్‌ (Surat)
4,585,367
జయపూర్‌ (Jaipur)
3,073,350
కాన్పూర్‌ (Kanpur)
2,920,067

రాష్ట్రంలో..

నగరం
జనాభా
హైదరాబాద్‌
7,749,334
విశాఖపట్టణం
1,730,320
విజయవాడ
1,491,202
వరంగల్లు
759,594
గుంటూరు
673,952
నెల్లూరు
564,148
రాజమండ్రి
478,199
కర్నూలు
478,124
తిరుపతి
459,985
కాకినాడ
442,936

                ఇవన్నీ కాకిలెక్కలేనని నాకనిపిస్తోంది...! లేకపోతే మా కాకినాడ జనాభా 4 లక్షలా..? అన్నీ తప్పుడు లెక్కలే..! 8 లక్షలకి ఒక్కటికూడా తక్కువుండని ఊరది..! ముంబయి కన్నా ఎంతో పెద్ద నగరమైన దిల్లీనేమో రెండో స్థానంలోకి తోసేసారు.. గాజియాబాద్‌, గురుగావ్‌, ఫరీదాబాద్‌ లాంటి పక్క ఊళ్లకి వేరు లెక్కలెయ్యడం వల్ల వచ్చినదది..! "జాతీయ రాజధాని ప్రాంతం  (National Capital Region)" అన్నీ లెక్కలేసుకుంటే మూడు కోట్ల అంకెని ఇంచుమించు తాకుతుంది. దిల్లీ జనాభా, అందులో సగం..? ఈ "జాతీయ రాజధాని ప్రాంతం",  దిల్లీతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌, నొయిడా (ఇక్కడే భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా వన్‌ రేస్‌ కోర్స్‌ నిర్మితమౌతోంది.), మీరట్‌, హరియాణలోని గురుగావ్‌, ఫరీదాబాద్‌, సోనీపట్‌.. ఇలా పక్క రాష్ట్రాల్లోకి విస్తరించిపోయి ఉంది. ఇవేమీ దిల్లీ నగరపరిధిలోకి తీసుకోలేదు..
                రాష్ట్రంలో నాలుగో స్థానంలో (కనీసం ఐదో స్థానం) ఉన్న మా కాకినాడని పదో స్థానానికి తోసెయ్యడం కూడా, ఇంతే..! ఎంత అన్యాయం..? (సరదాగా అంటున్నాను.. సీరియస్‌ అవ్వకండి..!)


( కింది వివరాలు అసందర్భమైనా, వేరే పోస్ట్‌ రాయడం ఇష్టం లేక రాస్తున్నాను..!

  కొన్ని ఉపయుక్తమైన ధార్మిక వెబ్‌సైట్లు

15, అక్టోబర్ 2011, శనివారం

ఆంధ్రప్రదేశంలోనుండి ఎన్ని రాష్ట్రాలొస్తే బావుంటుందీ..?



"ఏమీ రాకపోతేనే బావుంటుంది" అనేవాళ్ళూ..! దయచేసి క్షమించేయండి..! రాష్ట్రం విడిపోతే మంచిదా, విడిపోకపోతే మంచిదా., అనేదాని మీద స్పష్టత వచ్చినా, ఒక స్టాండ్‌ మీదకి రానివాణ్ణి..! (చంద్రబాబులాగే..!) అందువల్ల ఒక్కోసారి ఇటువైపూ, ఒక్కోసారి అటువైపూ తిరిగిపోతూ ఉంటాను. ప్రస్తుత పోస్ట్‌లో "రాష్ట్రాన్ని విడగొట్టేయమని"..నాకు అధికారం ఇస్తే., (ఎవరిస్తారో..?) ఏయే రాష్ట్రాలు ఇచ్చేస్తానో రాస్తున్నాను. చూస్కోండి..! విడగొట్టేయడం అంత ఈజీయా అని అడగేవారికి నేను చెప్పే సమాధానమేంటంటే, "చాకలిపద్దు"..అంత ఈజీ అన్నదే..!
(గమనిక: 1. ఇది నిజంగానే సీరియస్‌..!..
               2. కొన్ని జిల్లాలు పక్కరాష్ట్రాలనుండి లాక్కోవడం జరుగుతుంది)

ప్రస్తుతం రాష్ట్రంలో వినిపించిన డిమాండ్లు..తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర), రాయలసీమ, మన్యసీమ..
సాధారణంగా పేర్కొనే ప్రాంతాలు..............  తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ..

సరే.., "రాయలవారి" కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొంటే, మనకి ఈ ప్రాంతంలో మూడు రాజ్యాలున్నట్టుగా తెలుస్తుంది.. అవి
"విజయనగర సామ్రాజ్యం"........ "బహమనీ సుల్తానుల రాజ్యం".......... "కళింగ రాజ్యం"..!
                ఇప్పటికీ తన్నుకుంటున్నది పరోక్షంగానైనా ఈ పేర్లతోనే కదా..! అందువల్ల, నేను ఇచ్చేసే రాష్ట్రాలు ఈ మూడు మాత్రమే..!
రాయలసీమ
తెలంగాణ
కళింగ

ఇప్పుడు చెప్పిన మూడు రాష్ట్రాల పరిధి ఎట్టిదనిన...

రాయలసీమ - (ఇప్పటి రాయలసీమలోని నాలుగు జిల్లాలు + నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి + బళ్ళారి, కృష్ణగిరి, కోలారు + హోసూరు, వేలూరు.. దీనికి రాజధాని "మద్రాసు" (తమిళులతో కలిపి..!). తమిళనాడుని కూడా విడగొట్టేస్తాం కాబట్టి, అక్కడి తొండ మండలం వారు, కొంగు మండలంవారు కూడా కలుస్తానంటే కలవచ్చు.., లేదంటే మానొచ్చు..! "తొండ మండలం" కలిస్తే ఉన్న ఎడ్వాంటేజీ ఏంటంటే "మద్రాసు"..ఒక్క రాష్ట్రానికే రాజధాని అవుతుంది. అదీ రాయలసీమే..!)

తెలంగాణ - ఇప్పుడున్నట్టే...! నాందేడ్‌, బీదరు కూడా కావాలంటే, కలిపేద్దాం..! (మిగిలిన తెలుగు జిల్లాలు పెద్దగా తెలీదు..! తెలిస్తే వాటిని కూడా కలిపేద్దాం..! రాజధాని- హైదరాబాద్‌..!)

కళింగ - తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం + గంజాం, రాయగడ, కోరాపుట్‌, మల్కాన్‌గిరి + ఒరిస్సాలోని ఇతర తెలుగు ప్రాంతాలు + వీలుంటే దంతెవాడ, బస్తర్‌ ప్రాంతాలు.. దీనికి రాజధాని - విశాఖపట్నం..!)

రాయలసీమ లో - గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి ఎందుకు కలిపేసానని డౌట్‌ వచ్చిందా..? నేను ముందే చెప్పానుగా "రాయలవారి కాలాన్ని" పరిగణలోకి తీసుకున్నానని..! అప్పట్లో,  "గోదావరి" నదే... "విజయనగర రాజ్యా"నికీ "కళింగ"కీ సరిహద్దు..! (రాయలవారి దండయాత్రలని పక్కనబెట్టండి..!) అందువల్ల రాయలసీమ రాష్ట్రానికీ, కళింగ రాష్ట్రానికీ మధ్య సరిహద్దు మళ్ళీ గోదావరే..!

ఈ ప్రాంతాలన్ని అప్పటి (రాయల కాలంనాటి) విస్తీర్ణంతో పోలిస్తే చిన్నవైనా తప్పదు ఎడ్జస్ట్‌ అయిపోవాలి..! అంతే...! ఇహపోతే.., ఇంకో విషయం..! అప్పట్లో కళింగకీ, విజయనగరానికీ ఉన్న కామన్‌ శత్రువు "బహమనీ సుల్తానులు.."..! ఇప్పుడు కూడా ఆ పోలిక సరిపోతుందనుకుంటాను..

ఆ విధంగా మనం కోల్పోయిన ఊళ్లన్నీ వెనక్కి వచ్చేస్తాయి..! తన్నులాటలూ తప్పుతాయి..! దీనికి ఒప్పుకునే రాజకీయ పార్టీ ఏదైనా ఉంటుందా..?

10, అక్టోబర్ 2011, సోమవారం

ఆర్య -ద్రవిడ -4 ( ఎందుకొచ్చిన గొడవదింతా..? వదిలేస్తే పోలా..? )



వారం క్రితం మొదలుపెట్టిన సుత్తిని ఇవాళ్టితో పూర్తి చేసేద్దామనుకుంటున్నాను. కాస్త చదివేసి కోపరేట్‌ చేసెయ్యండి.. లేదూ..! మొదట్నించీ చెప్పాల్సిందేనంటారా..? అయితే వెళ్లిండి.. ఫస్టు పార్టు, సెకండు పార్టు, థర్డు పార్టు..

సంస్కృతానికీ, లాటిన్‌ కీ ఉన్న సంబంధం దగ్గర ఆగాం కద..! అక్కణ్నుంచే కంటిన్యూ చేసేద్దాం మరి..! చేసెద్దాం అనెయ్యండం బానే ఉందిగానీ, మన దగ్గర మేటర్‌ ఉండొద్దూ..! మహ మహ భాషాశాస్త్రవేత్తలే తన్నుకుంటున్న సంబంధం గురించి చెప్పడానికి నేనెవర్ని.. అందుకే, నాకు తెలిసిన నాలుగు ముక్కలూ రాసేస్తున్నాను.. చూస్కోండి..!

శనకైస్తు క్రియాలోపాదిమా: క్షత్రియ జాతయ:
వృషలత్వం గతాలోకే బ్రాహ్మణాదర్శనే న చ
పౌండ్రకా శ్చౌఢ్ర ద్రవిడా: కాంభోజా యవనా శ్శకా:
పారదా పహ్లవా శ్చీనా: కిరాతా దరదా: ఖశా: (10-43,44)
దీనర్థం "పౌండ్రక, ఓఢ్ర, ద్రవిడ, కాంభోజ, యవన, శక, పారద, పహ్లవ, చీన, కిరాత, దరద, ఖశదేశములందు జన్మించిన క్షత్రియులు బ్రాహ్మణ దర్శనము లేనివారై ఉపనయనాది సంస్కారహీనులై క్రమముగా వృషలత్వము చెందిరి."
ఇది జటావల్లభుల పురుషోత్తం గారు సంకలనం చేసిన "ధర్మమంజరి"లోనిది. ఇది మనుస్మృతి నుండి సంగ్రహించబడింది. దాని తర్వాతి శ్లోకం కూడా రాస్తున్నాను. సంస్కృతం బాగా వచ్చిన వారు దాని అర్థం చెప్పగలరు..!
ముఖబాహురూపద్జానాం యా లోకే జాతయో బహి:
మ్లేచ్ఛవాచశ్చార్యవాచ: సర్వే తే దస్యవ: స్మృతా: (10-45)
దీనర్థం నాకు తెలీదు..! మీకు తెలిస్తే తెలుసుకొనగోరుచున్నాను.!

ఇంకో విషయం...! మ్లేచ్ఛుల జననం గురించి భారతంలో ఉన్నదట..! విశ్వామిత్ర, వసిష్ఠుల సంఘర్షణలో కామధేనువు నుండి ఉద్భవించినవారే మ్లేచ్ఛులట..!

భారతదేశపు క్షత్రియ వంశజుల సంతతివారే యవనులని, మన పురాణవేత్తల ప్రగాఢ విశ్వాసం..! (ఈ విశ్వాసాన్ని మాక్స్‌ ముల్లర్‌ పరిగణనలోకి తీసుకోలేదు.. కారణాలు కొంతమందికి కోపం తెప్పించేవిధంగానూ, కొంతమందికి నవ్వు తెప్పించేవిధంగానూ ఉంటాయి..). అందుకు యయాతి..అతని ఐదుగురు పుత్రుల కథని చెప్పుతారు. అందులో నాకు జ్ఞాపకం ఉన్నది ఇద్దరు "పురువు."..."యదువు".. యదు సంతతి వారే యాదవులు..! పురు వంశస్థులే కౌరవులూ, పాండవులూనూ.. (ఈ విషయంలో చాలా భేదాభిప్రాయాలున్నాయి..! పురు వంశం, కురువంశం ఒకటి కాదని కొందరూ, ఒకటేనని కొందరూ అంటూంటారు..!) మిగిలిన ముగ్గురు కొడుకులూ భారతదేశాన్ని వదిలి ఉండవచ్చని, వారి సంతతే యవనులూ, పఠాన్లూ, తదితరులనీ కొంతమంది భావన..!

ఇక్కడి వరకూ కొంతమందివరకైనా తెలిసిన విషయాలే..! పైగా చరిత్రకందగల కాలానికి చెందినవే..! చరిత్రకందని రామాయణం కాలం సంగతేమిటి..? రామాయణకాలానికీ, భారతకాలానికీ 1000 సంవత్సరాల నుండి 15 లక్ష సంవత్సరాల వరకూ (ఎవరి లెక్కలు వాళ్లవి..!) తేడా ఉంది కదా..! అప్పడేమి జరిగాయో మరి ఎక్కడ రాసుందీ..?

ఎక్కువమంది విశ్వసించే విధంగా రాముడు అయోధ్యలోనే పుట్టాడని, భారతదేశానికే పరిమితమయ్యాడనీ అనుకుందాం..! కానీ రాముని వారసులూ, సోదరులూ అయోధ్యకే పరిమితం కాకపోయి ఉండవచ్చనిపిస్తోంది..! ఎందుకంటే, భరతుడు గాంధారదేశాన్ని జయించాడట..!  భరతుని పుత్రులైన తక్షకుడు, పుష్కళుడు గాంధార దేశాన్ని పరిపాలించారట..! తక్షకుడు నిర్మించిన నగరాలు తక్షశిల., తక్షఖండం (ఉజ్బెక్‌స్థాన్‌ రాజధాని తాష్కెంట్‌..!)..! పుష్కళుని నిర్మితం పుష్కళావతీ నగరం.. అదే నేటి పెషావర్‌..! అలాగే, లవుడుకుశుడు నిర్మించిన నగరాలు నేటి పాకిస్థాన్‌ లో ఉన్నాయి. లవుడు నిర్మించిన నగరమే నేటి లాహోర్‌ (లవపురి)..! కుశుడు నిర్మించిన నగరం కాసూర్‌..!

ఎక్కడి అయోధ్య..? ఎక్కడి తాష్కెంట్‌..? ఒక్క తరంలో అంత స్థానచలనం ఉన్నప్పుడు, ఎన్నో తరాలు మారిపోయాయి, ఇప్పటికి..ఇంకెన్ని చలనాలు ఉండుంటాయి..? అందువల్ల భారతదేశం లోపలికీ, బయటికీ వలసలు జరిగాయన్నది కొట్టిపాడెయ్యలేని వాదం..! మరి, మన పురాణవేత్తల (భారతీయ చరిత్రకారులు) విశ్వాసాన్ని మాక్స్‌ముల్లర్‌ పరిగణలోకి తీసుకోక తప్పుచేసాడని అనుకోవచ్చుగా..!

సంస్కృతానికీ, లాటిన్‌ మధ్యలో సంబంధం వెతకాలంటే, మన పురాణాలనీ, ప్రాచీన రోమనుల సాహిత్యాన్నీ, గ్రీకుల పురాణాలనీ, పారశీకుల మతగ్రంథాలనీ తీవ్రంగా అధ్యయనం చేసి, వారి మూలస్థానం ఎక్కడని పేర్కొన్నారో తెలుసుకోవాలి..! ఇదంత ఈజీ ప్రాసెస్‌ కాదు..! ఎప్పట్నుంచో తన్నుకుంటున్నది ఇక్కడే..! మనదేశంలోనైతే, గురుశిష్యపరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగి మన ప్రాచీన గ్రంధాలలో కొంతైనా మనకి లభించింది. అయితే, వాళ్ల పరిస్థితి అది కాకపోవచ్చుగా..! గ్రీకు సంస్కృతిని పారశీకులు కూలగొట్ట ప్రయత్నిస్తే, పారశీక సంస్కృతిని ఇస్లాం కూలగొట్టింది. అదే విధంగా రోమనుల సంస్కృతినీ క్రైస్తవం కూలగొట్టింది. అంతకు ముందు అరేబియా, పారశీకం, రోమ్‌, గ్రీసు లాంటి చోట్ల విగ్రహారాధక సంస్కృతే ఉండేది..! ఇదంతా, చరిత్రకందిన కాలంలో జరిగిన సంఘటనలు, మరి అంతకు ముందేమి జరిగిందో..? ఎన్ని దాడులు జరిగాయో..? ఇలాంటివన్నీ అనంత ప్రశ్నలూ, భేతాళ ప్రశ్నలూనూ..! వెరసి, ఇక్కడ తేలిన విషయం ఏంటంటే, అంతా అయోమయం.....అగమ్యగోచరం..!




ఇంక ముగించేద్దాం.. ఈ సుత్తిని...!

ఏ వాదం చేసినా సరే, అది మానవశ్రేయస్సుకి ఉపయోగపడేదై ఉండాలి..! అందులోనో మనది "సర్వే జనా: సుఖినోభవంతు", "వసుధైవ కుటుంబకమ్‌"..సంస్కృతి కదా..! అందువల్ల మన భారతదేశంలో అది ముందే అవసరం..! ఆర్యులు, ద్రవిడులూ అని తన్నుకుంటూ ఉండడం అస్సలు మంచిది కాదు..! ఋగ్వేదంలో చెప్పినట్టు "భారతదేశం నానాజాతి సంగమం".. అనేదాన్ని అంగీకరించేసి, అందర్నీ గౌరవిస్తే బాగుంటుంది..!

చరిత్ర..విషయానికొస్తే, భారతీయుల సంస్కృతికీ, మిగిలిన నాగరికతలకీ ఉన్న తేడా ఏమిటంటే, వాళ్ళు ఉన్నదున్నట్టు రాసేవాళ్ళు... మనవాళ్ళేమో భక్తిభావంతో రాసేవాళ్లు. అందువల్ల మనవాళ్లు ఏం రాసారో తిన్నగా అర్థం కావాలంటే, భక్తిభావంలో "రాసినవారి స్థాయి"కెళ్లిపోవాలి.. అప్పటివరకూ పూర్తిగా అర్థం కాదు..! అర్థం చేసుకునే సమయం ఎవ్వరికీ దొరకదు...!

"పురాణం" అనే పదం యొక్క అర్థం "చరిత్ర",..అని(ట..!). అందువల్ల, ఒకప్పుడు పురాణం చదువుకున్నవారు హిస్టరీ స్టూడెంట్స్‌ కింద, రీసెర్చర్స్‌ కింద లెక్కలోకొచ్చేవారు..! వాళ్లిచ్చే లెక్చర్లే హరికథలూ, బుర్రకథలూ, జానపదకథలూ ఇలాగన్నమాట..! మనకి తెలిసిన 18 పురాణాలు, 18 ఉపపురాణాలు కాకుండా వేలకొద్దీ కులపురాణాలూ, లక్షలకొద్దీ స్థలపురాణాలు కూడా ఉన్నాయి (ఉండేవి). దురదృష్టం ఏంటంటే, వీటిలో చాలాభాగం లిపిబద్ధం కాక, ఖిలం అయిపోయాయి (అయిపోతున్నాయి..!). వీటినన్నింటినీ, సేకరించి, క్రోడీకరిస్తే, కులం ఎందుకు పుట్టిందో, "అందరూ ఒక్కటే" ఎలా అవుతారో, తదితర విషయాలన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ చేసేవాళ్లెవరు..?

విషయం పక్కదారి పట్టేసింది. అసలు విషయానికొద్దాం..! ఎవరు అవునన్నా, కాదన్నా మనచరిత్ర విదేశీయులు రాసిందేనన్నది నిజం..! మాక్స్‌ ముల్లర్‌ ప్రబుద్ధులు ఒక్కోచోట మన పురాణాలకీ, కథలకీ అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడదు. అందువల్లనే మన చరిత్రనిండా కంతలే..! అది "ఆర్య -ద్రవిడ" రాద్ధాంతమే కావచ్చు.. ఇంకోటే కావచ్చు..!

(ఇంతకన్నా ఎక్కువ సుత్తి కొట్టేస్తే కష్టం.. అందుకే ఆపేస్తున్నాను..!)

4, అక్టోబర్ 2011, మంగళవారం

ఆర్య -ద్రవిడ -3 (లేమురియా, కుమారి ఖండం)



ఇంతకు ముందు రాసిన సుత్తిలోని మొదటి భాగంరెండవ భాగం..తర్వాత ఇది మూడవ భాగం

ద్రవిడులు అసలు స్థానికులేనా అనే కదా.. ప్రశ్న వచ్చిందీ..!

కాదని నేనక్కర్లేదు...! కొంతమంది  "ద్రవిడ జాతి" వాదులే అన్నారు..!

ఆ మధ్యనెప్పుడో "తమిళ-తెలుగు" తన్నులాటలని చూసాను. అందులో ఒక్క తెలుగువాడు మిగిలిన తమిళంవాళ్ళనందరినీ చీల్చిచెండాడేస్తున్నాడు. "తమిళనాడు" పేరు హాస్యాస్పదమనీఅసలు "తెలుగు నాడు"అనేదే ఉండవలసిన పేరనీ సాగిపోతూండగామధ్యలో ఎవడో తెలుగువాళ్లని "ఉత్తరదిశ" నుండి వచ్చితమ భూభాగాలని ఆక్రమిచారన్నట్టుగా అన్నాడు. దానికీ తెలుగతను తమిళం వాళ్లసలు భారతీయులే కాదనీ, "లేమురియా"..అనే ఖండం నుండి వచ్చారని అన్నాడు.. ఆ తర్వాత డిస్కషన్‌ జ్ఞాపకం లేదు.. అసలీ "లేమురియా"..అంటే ఏంటో చూద్దాం ముందు..!

లేమురియా కూడా "అట్లాంటిస్‌"లాగే సముద్రంలోకి వెళ్ళిపోయిన భూఖండం (కొంతసేపు నిజం అనుకుందాం..!) 1864లో ఫిలిప్‌ స్క్లాటర్‌ అనే అసామి, "mammals of Madagascar" ...అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించాడు. అతనికి మడగాస్కర్‌భారతదేశంలో లభించిన కొన్ని శిలాజాలుఆఫ్రికా ఖండంలో దొరకలేదట.! అందువల్ల భారతదేశంమడగాస్కర్‌ ఒకప్పుడు ఒకే పెద్ద ఖండంలో ఉండి ఉండవచ్చని భావించాడు. (అవి క్షీరదాలు..! క్షీరదాలు భూమ్మీద పుట్టే సమయానికిమన భూమి సుమారు ఇప్పుడున్నట్టుగానే ఉంది..! ఇదీ ఎక్కడో చదివాను)


దీనికి సంబంధించిన వర్ణనలు తమిళ "సంగమ" సాహిత్యంలో ఉన్నాయట..! దీన్ని అందులో "కుమారి ఖండం"..అని పిలిచేవారట..! "కలిత్తోకై", "శిలప్పధికారం"లలో కొన్ని చోట్ల వాటి గురించి ప్రస్తావనవర్ణనలూ వచ్చాయట..! కన్యాకుమారికి దక్షిణంగా కొన్ని వందల మైళ్ళ మేర వ్యాపించి ఉండేదట..! "క్రూరమైన సముద్రం"..కన్యాకుమారిపహరౌలి నదికి మధ్యగా ఉన్న పాండ్యుల భూమిని లాక్కొనగాఆ పాండ్యులు చేరచోళ రాజుల భూభాగాలను ఆక్రమించాడట..! "పహరౌలీ", "కుమారి"..అనే నదులుఆ మునిగిపోయిన భూఖండంలో ప్రవహించేవట..!

ఇంతవరకూ బానే ఉంది..! అయితే, 1992లో ఆర్‌. మతినవన్‌ అనే ఆసామి ద్రవిడుల కాలరేఖ ఈ క్రింది విధంగా రాసాడు.. పూర్తి వివరాలు ఈ వికీపీడియావ్యాసంలో
//            ca. 200,000 to 50,000 BC: evolution of "the Tamilian or Homo Dravida",
ca. 200,000 to 100,000 BC: beginnings of the Tamil language
50,000 BC: Kumari Kandam civilisation
20,000 BC: A lost Tamil culture of the Easter Island which had an advanced civilisation
16,000 BC: Lemuria submerged
6087 BC: Second Tamil Sangam established by a Pandya king
3031 BC: A Chera prince in his wanderings in the Solomon Island saw wild sugarcane and started cultivation in Kumari Kandam.
1780 BC: The Third Tamil Sangam established by a Pandya king
7th century BC: Tolkappiyam (the earliest known extant Tamil grammar)//

            అయితేదీన్ని ఎవరూ ఒప్పుకోవడం లేదు..! మరీ క్రీ.పూ. 50 వేల సంవత్సరం దగ్గర నాగరికత అంటేనమ్మబుద్ధికావడం లేదుగానీఏదో 3,4 వేల సంవత్సరాల కిందనైతే నమ్మవచ్చేమో..! (అది కూడా పూర్తి ఆధారాలతో)..కొంతసేపు ఇది నిజమని అనుకుంటే, "ద్రవిడులు"..స్థానికులు ఎలా అయ్యారన్నదే నా అనుమానం..! "కుమారి ఖండం".. తప్పయితే.. సంగం సాహిత్యం..మీద కూడా గురిపెట్టాల్సొస్తుందేమో..! ఆర్యులు వచ్చి ద్రవిడులను తరిమేసినట్టుగా లేదుకదా..! కేవలం ద్రవిడులే భారతదేశానికొచ్చి చేరచోళ భూభాగాలను ఆక్రమించుకున్నట్టుగా ఉందిగా..! దీని మీద పరిశోధనలు చేయాలి.. (ముఖ్యంగా తమిళుల పరిశోధనను ఇక్కడ అస్సలు నమ్మకూడదు..!)

            మళ్లీ మనం "భవిష్య పురాణం" దగ్గరకి వద్దాం..! ముందు దాని ప్రామాణికత మీదే అనుమానపడ్డాను కదా..! దాని ప్రామాణికతను సమర్థించేది నిజంగా జరిగినజరుగుతున్న చరిత్రే..! పృథ్వీరాజుజయచంద్రుల గురించీతైమూర్‌ లంగ్‌ భారతదేశ దండయాత్ర గురించీబాబరూఅక్బరూఔరంగజేబుతదితర మొగలాయిల గురించీశివాజీ గురించీబ్రిటీషువారి పరిపాలన గురించీ రాసి ఉంది..సంవత్సరాలతో సహా..! (పోనీ దీన్ని కూడా ఎవడో ఎక్కించాడనుకుందాం..!) బ్రిటీషువాళ్ల తర్వాత మౌనులు భారతదేశాన్ని పరిపాలిస్తారని కూడా ఉంది..(స్వాతంత్ర్యం గురించి లేదు మరి..!) ఈ మౌనులెవర్రా అంటేబౌద్ధధర్మపరాయణులటహిమాలయవాసులటభభ్రువర్ణులట..ఇలా వర్ణనలున్నాయి. వీళ్లు టిబెట్‌ వాళ్లైనా కావచ్చుచైనా వాళ్లైనా కావచ్చు. "మౌన"..శబ్దం.. "మావో"..లతో కలుస్తోందని నా ఉద్దేశ్యం. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. భవిష్య పురాణం కరెక్టోకాదో..!
            సరే..! మరి సంస్కృతానికీలాటిన్‌కీ ఉన్న సంబంధం మాటేమిటి..?
(ఇంకా ఉంది నా చేటభారతం)

ఆర్య - ద్రవిడ -2 (ఈ కథ ఎందులోదో..?)


నేను కొడుతున్న సుత్తి లోని నిన్నటి భాగం తర్వాత ..!

"యెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింద"నే సామెత మాక్స్‌ ముల్లర్‌ ప్రబుద్ధులకు సరిగ్గా సరిపోతుంది.! అతగాడికి సంస్కృతం నేర్చుకోవాలనీ, భారతదేశం రావాలనీ ఎందుకు బుద్ధిపుట్టిందో తెలీదుగానీ, అందువల్లే ఓ ప్రపంచ యుద్ధం వచ్చింది. భారతదేశంలో "ఆర్యులు- ద్రవిడులు"..అని నిత్యం తన్నుకుంటున్నారు. మాక్స్‌ ముల్లర్‌కి ముందు నుండే మాక్స్‌ ముల్లర్‌ ప్రబుద్ధులు ఉన్నారని ఈ కథద్వారా గ్రహించవచ్చు. (అంతకు ముందువారి పేర్లు తెలీకపోవడంవల్ల మాక్స్‌ముల్లర్‌ ప్రబుద్ధులనే రాస్తున్నాను.). ఈ కథ బైబిల్‌నుండి భవిష్య పురాణంలోకి ఎక్కించేసారని గ్రంధకర్త పూర్తిగా విశ్వసించి వ్యాఖ్యానంగా రాసారు.
//ద్వాపరమున పదునారువేల సంవత్సరములు మిగిలియుండగా భూమండలము బహుకీర్తిమతియై పేరొందెను. కొన్ని దేశములు విప్రులు కొన్ని యెడల క్షత్రియ వంశీయులు, కొన్ని తావుల వైశ్యులు, కొన్ని చోట్ల శూద్రులు, మరికొన్ని మూలల వర్ణసంకరులు రాజులయ్యెదరు. ఎనిమిదివేల యెనుబదినాల్గుసంవత్సరములు ద్వాపరయుగము మిగిలియున్నదనగా మ్లేచ్ఛ దేశమంతయు గీర్తివంతమగును.
                ఇంద్రియములను దమించి, ఆత్మధ్యాన పరాయణుడయునవా డగుటచే "అదాము" అనే పేరు గలవాడొక మ్లేచ్ఛుడుండెను. వాని భార్య "హవ్యవతి"యట. "హవ్వ"అనేదాని కృత్రిమ సంస్కృతరూపమిది. ప్రధాన నగరమునకు దూర్పున గల మహావనము నాల్గు క్రోసులమేర నీశ్వరునిచే నిర్మితమయినది. పెండ్లాము దర్శనము కోరి పాప వృక్ష తలమున నుండెను. "కలి" యటకు సర్పరూపమున వచ్చెను. ఆ ధూర్తునిచే మోసగింపబడి "ఆదాము" విష్ణునాజ్ఞాను భంగపరచెను. ఆ పాపవృక్షఫలము తినవద్దని విష్ణువు శాసించినను అందముగానున్న యా పండును భార్యాభర్తలిద్దరు తినిరి. ఆ మేడియాకులు తిని, వాయువు భక్షణముకూడా చేసిరి. అంత వాండ్రకు కొడుకులు కలిగిరి. అంతా మ్లేచ్ఛులే. ఆదాము తొమ్మిదివందల ముప్పది సంవత్సరములు జీవించెను. ఆ పండ్లను భార్యతో హోమముచేసి స్వర్గమందెను. వానికి బుట్టినవాడు శ్వేతుడు. వాడు తండ్రికంటే మరి పండ్రెండ్రేం డ్లక్కువ బాలించెను. వానికొడుకు "అనువరుడు" వానికంటె నూరేండ్లు తక్కువ జీవించెను. తరువాత కీనాశుడు నంతే జీవించెను. మహల్లలు డైదేండ్లు తక్కువగా తొమ్మిదివందలు జీవించెను. వాడు తనపేర నగరము నిర్మించెను. వాని తరువాత విరదుడు తొమ్మిది వందలరువదియేండ్లు బ్రతికెను. తనపేర నగరము నిర్మించెను. హనూకుడు విష్ణుభక్తి పరుడు. పండ్లను హోమముచేసి తత్త్వమసి జ్ఞానముపొందెను. మూడువందల అరువదియేండ్లు జీవించెను. వాడు మ్లేచ్ఛధర్మ పరాయణుడై స్వర్గమందెనట. ఆచారము, వివేకము, ద్విజత్వము, దేవపూజ అనునవి చేయువాడు కాన "మ్లేచ్ఛుడు" అనుపేరు వచ్చెనని పండితులందురు; విష్ణుభక్తి, అగ్నిభక్తి, అహింస, తపస్సు, దమము అనేవి మ్లేచ్ఛధర్మములని మునులన్నారు. హనూకుని కొడుకు మతోచ్చిలుడు తొమ్మిదివందలడెబ్బడియేండ్లు పాలించెను. వాని కొడుకు న్యూహుడు. విశేషజ్ఞానము "ఊహ" గలవాడని యూ పేరొచ్చినదట. అయిదువందలయేండ్లు పాలించెను. నీముడు, శముడు, భావుడు అనువారు వాని  ముగ్గురు కొడుకులు. న్యూహుడు విష్ణుభక్తుడు."సో హం" ధ్యానపరాయణుడు. ఒకనాడు విష్ణుభగవానుడు వాని కలలో కనిపించి "వత్స! నేటి కేడవరోజు ప్రళయము వచ్చును. నీవు నీజనులతో నావయెక్కి! బ్రతుకుము, సర్వశ్రేష్ఠుడ వయ్యెదవు"అనెనట. మూడు వందల హస్తములు పొడవు నేబది హస్తములు వెడలుపు; ముప్పది హస్తముల యెత్తుహల నావ నెక్కెను. నల్బది రోజులు సాంవర్తక (ప్రళయ) మేఘములు సర్వభారత వర్షమును నీట ముంచెత్తును. అపుడు న్యూహుడు నెనుబదివేలమంది మునులు విశాలానగరమునకు వచ్చి జీవించిరి. మిగిలిన జీవకోటి నశించెను. అప్పుడు విష్ణుమాయను వారు నుతించిరి. అపుడు మరల నేల బయలుపడెను. శిషిణములనెడి హిమాద్రి ప్రదేశముల దగ్గర నావనెక్కి జల ప్రళయమయిన తరువాత నచట నివాసం చేసికొనెను. న్యూహునికి విష్ణువు దయచూపి వంశవృద్ధి చేసెను. దేవభాషకు వ్యతిరేకముగా మ్లేచ్ఛభాష వృద్ధిచేసెను. న్యూహుని కొడుకులు సిముడు, హాముడు, యాకూత్‌ అనే ముగ్గురు. యాకూత్తుకు జు మ్రుడు, మాజాజ్‌, మాదీ, యానానుడు, తూవలుడు, మసకుడు, తీరసుడు, అనే కొడుకులేడుగురు పుట్టిరి. వాళ్ల పేర్లతో దేశము లేర్పడెను. .......................... కలిలో నీ మ్లేచ్ఛులు వృద్ధి పొందిరి.//

                "ఆదాము".."హవ్వ"..అంటే "ఆడం", "ఈవ్‌"..అని తేలిగ్గానే అర్థమైపోతోంది. అబ్రహామిక (abrahamic religions) మతస్థుల గ్రంథాలలోని కథనే ఇక్కడ ఎక్కించారని తెలిసిపోతూనే ఉంది. కాదని ఎవరైనా అంటే నాదొక ప్రశ్న.. "మ్లేచ్ఛుల వృద్ధ"నగానే ఈ కథనే ఎందుకు రాసారని..? భాగవతం, మను స్మృతి ప్రకారం, మ్లేచ్ఛులంటే యవనులూ, శకులూ, గురుండులే కాక, పల్లవులూ, ద్రవిడులూ, ఓఢ్రులు, కిరాతులు, .ఇలా చాలా దగ్గర వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లందరూ భారతదేశంలో ఉంటూనే ఉన్నారుగా..! మరి మ్లేచ్ఛ వృద్ధికి వీళ్ల కథలేమీ లేకుండా, ఎక్కడో ఉన్న గురుండుల కథనే తీసుకోవడం ఏంటి..? (దీని గురించి తర్వాత పూర్తిగా మాట్లాడుకుందాం..!)

ఓసారి. భవిష్యపురాణంలోని "ఈశపుత్రుడు".. "మహామదుడు"... ప్రస్తావన కూడా పరిశీలిద్దాం..
                శాలివాహనుడు హిమాలయ ప్రాంతంలో ఉండగా ఓ వ్యక్తిని చూసి పలకరించగా..ఆ వ్యక్తి తాను ఈశపుత్రుడననీ, కుమారిగర్భమున జన్మించాననీ, జనులు తనను "మసీహుడ"న పేర అవతరించినాననీ, మ్లేచ్ఛధర్మ  పరివర్తకుడనీ చెప్పాడట..! ఇంకా ఈశపుత్ర మతస్థులు సూర్యభక్తులనీ, సత్యసంధులనీ, చాలా చాలా ఉన్నాయి...
అదే మహామద మతస్థుల గురించి పరిశీలిస్తే..
                భోజుడు భారతదేశానికి తిరిగి వస్తూండగా మహామదుడు వెంబడించి, మాటలు కలిపాడట..! మహారాజుని మోహపెట్టబోగా, కాళిదాసు ఆగ్రహించి, నవాక్షరీ మంత్రం జపించి హోమము చేయగానే, ఆ "మహామదుడు" భస్మమై అతని శిష్యులకు దేవుడైపోయాడట..! ఆ తర్వాత ప్రేతరూపంలో మహారాజు దగ్గరకు వచ్చి, తానొక మతాన్ని స్థాపించబోతున్నాననీ, ఆ మతస్థుల లక్షణాలను చెప్పుకున్నాడు. ఆర్యులు ధర్భలచేత సంస్కారం చేసికొన్నట్లే, ఆ మతస్థులు "ముసలం"చేత సంస్కారాలు చేసుకుంటారట..! అందువల్ల వారు "ముసలవంతుల"ని పిలవబడతారట..!
                అలాగే బ్రిటీషు వారు ముందు బౌద్ధధర్మబద్ధులై ఉండి, తర్వాత ఈశపుత్రమతస్థులయ్యారట..! వీరేమో మరి సత్యసంధులూ, సూర్యభక్తి పరాయణులూ..ఇలా చాలానే ఉన్నాయి.!
                ఇవన్నీ చూస్తే, అందరికీ టక్కున అర్థమయ్యే విషయం ఏంటంటే, "బ్రిటీషు వాళ్లు తమ పైత్యాన్ని ఇందులోకి ఎక్కించారు"..అని..! ముస్లింలకి, క్రైస్తవులకి, యూదులకి ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. క్రూసేడ్లూ జరుగుతున్నాయి. జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ ఇందులో ఇరికించడమే ఇక్కడ నేను చెప్పే బ్రిటీషు వాళ్ళ పైత్యం (లేదా మాక్స్‌ ముల్లర్‌ తదితర ప్రబుద్ధుల పైత్యం). అసలు "భవిష్య పురాణ" మూల గ్రంధమే భారతదేశంలో లేదని బ్లాగుల్లో ఎక్కడో చదివాను.  అటువంటప్పుడు దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకోగలం..? మాక్స్‌ముల్లర్‌ రాసిన "ఆర్యుల దండయాత్రా సిద్ధాంతం" లేదా  "ఆర్యుల వలస సిద్ధాంతం"...లోని ప్రధాన విషయం..!
                "మధ్య ఆసియా ప్రాంతంనుండి ఆర్యులు అనబడే తెగవాళ్ళు, భారతదేశంపైకి దండెత్తి అక్కడి స్థానికులను ఓడించి, వారిని దస్యులుగానూ (చిన్నప్పటి సోషల్‌ బుక్‌లో దస్యులు లేదా దాసులు అని రాసి ఉంది..!) పిలిచారు"..అనే కదా..! "బల ప్రయోగ సిద్ధాంతం"..అంటే పడి చచ్చే కమ్యూనిస్టులు దీన్ని తమ స్వార్ధానికి వాడుకుంటున్నారు. అదంతా వేరే విషయం..! కొంతమంది ఆ దస్యులు/దాసులనే ద్రవిడులని పిలిచేసారు.. అంటే, ద్రవిడులు స్థానికులనేగా వాళ్ల అభిప్రాయం..?
                సరే, ఇంతకీ ద్రవిడులు స్థానికులేనా..? ఇది నా ప్రశ్న..!
(ఇంకా వుందీ సుత్తి)

3, అక్టోబర్ 2011, సోమవారం

ఆర్యులు- ద్రవిడులు...



నాకు తెలిసున్నవీ, చదివున్నవీ నాల్గు ముక్కలు ఇక్కడ రాసేస్తే, ఓ పనైపోతుందని మొదలెడుతున్న పోస్టిది..! ఇక్కడ రాయబోయే విషయాలమీద నాకేమీ డీప్‌ నాలెడ్జి లేదు...! సో.. చదివేయండంతే..! బ్లాగ్లోకంలో ఇప్పటికే, దీనిమీద ఎన్నో వాదోపవాదాలు జరిగిపోయి ఉన్నాయి. అర్యులు, ఎక్కణ్నుంచో వచ్చారని కొందరూ, ఇక్కడివారేనని ఇంకొందరూ, ..ఈ డిస్కషన్‌ అంతా ఎందుకు..? అందరూ ఆఫ్రికా నుండే, వచ్చారని ఇంకొందరూ.. వాదించేసుకున్నారు/నిరూపించుకున్నారు...ఇలా చాలా చాలా చేసారు

కమ్యూనిస్టులు, హేతువాదులు చెప్పే పనికిమాలిన సుత్తిలో ఒకటైపు సుత్తేంటంటే "పుక్కిటి పురాణాలు..".."రామాయణం రంకూ..భారతం బొంకూ.."..ఇలా..! మన సంస్కృతి (అందులో హిందూ సంస్కృతి) అంటే, విపరీతమైన వెటకారం వాళ్లకి..! పుక్కిటి పురాణాలని కొట్టి పడెయ్యకుండా ఒక్కసారి తిన్నగా చదివితే, "ఆర్య- ద్రవిడ" సిద్ధాంతానికి కూడా ఆధారాలు దొరుకుతాయి మన పురాణాలలో.! ఈరోడ్‌ రామస్వామి పెరియార్‌, రామస్వామి చౌదరి అలాగే కదా..రామయణాన్ని, అర్యులు, ద్రవిడుల యుద్ధాలుగా వర్ణించారు.

ఇంక అసలు విషయానికి వద్దాం..! అందరికీ తెలిసిన విషయాలు..మనకి పద్దెనిమిది పురాణాలూ, పద్దెనిమిది ఉపపురాణాలూ, లెక్కకందని స్థలపురాణాలూ, కులపురాణాలు ఉన్నాయి కదా..! అందులో ఒకటి .."భవిష్య మహా పురాణం.."..ఎవరైనా చదవడానికి ఆసక్తిగా ఉంటే, గ్రేటర్‌ తెలుగు డాట్‌ కామ్‌లోని ఈ  లింక్‌ చూసుకోండి..

ఇంకో లింక్‌ కందుల సత్య శారద (బహుశా తెలుగావిడే అనుకుంటా..!)..అనే ఆవిడ... పురాణాలను పరిశోధించి, ఎవరెవరు ఎక్కడి వారో, ఎప్పుడు వచ్చారో, రాయడానికి ప్రయత్నం చేస్తోంది..! ఆవిడ అర్య-ద్రవిడ సిద్ధాంతాన్ని బలపరిచే ఒక కథని "భవిష్య పురాణం"లో చూపించింది.. ఈ కథ అంతకుముందే చదివాను కానీ., ఆవిడ రాసిన వ్యాసం చదివిన  తరవాతే, నాకూ తెలిసింది. ఈ కథ.. "అర్య-ద్రవిడ" సిద్ధాంతాన్ని బలపరిచేలా ఉందని..!

ఆ కథ ఉన్నదున్నట్టు..
//కలిలో వేయి సంవత్సరములు గడువగా స్వర్గమునుండి కాశ్యపుడను ద్విజుడు దేవాజ్ఞచే భూమికి బ్రహ్మావర్తమునకు వచ్చెను. అతని భార్య "ఆర్యావతి". వానికి పదిమంది కుమారులు గలిగిరి. ఉపాధ్యాయుడు, దీక్షితుడు, పాఠకుడు, శుక్లుడు, మిశ్రకుడు, అగ్నిహోత్రి, ద్వివేది, త్రివేది, పాండ్యుడు, చతుర్వేది అనువారు పేరులకు దగిన గుణము గలవారు. అందు కాశ్యపుడు కాశ్మీరమునకేగి సరస్వతిని ఎర్రని పుష్పాక్షతలచే బూజించి ధూపదీపాదులచే నైవేద్యములచే దృప్తిపరచి స్తుతించి మ్రొక్కుకొనెను. "అమ్మా! శంకరార్థాంగీ! నాయెడనీకేల దయరాదు? నీవు జగదంబవుకదా! ఏల్‌ జగమ్ముల కరుదేరవు. నీవు సుర కార్య నిమిత్తముగా ద్రోహియగు మ్లేచ్ఛునేల సంహరింపవు? ఉత్తమ సంస్కృతమును బాలింపుము. మ్లేచ్ఛులను వేగమే మోహింపజేయుము. నీవు బహురూపవు. ఒక్కహుంకారముచే ధూ మ్రలోచనుం గడతేర్చితివి. భయమకరుడైన యూ దైత్యుని దుర్గవయి యేల సంహరించి జగమ్ములకు సుఖంబు సేయవు? దంభము, మోహము, ఘోరమైన గర్వమును హరించి సుఖమునెల్ల యెడల చేయుదానవు. జగద్రోహులను వెంటనే కూల్పుము. అమ్మా! లెమ్ము! అని యిట్టులనిన నయ్యంబ వాని మనమున వసించి యుత్తమ జ్ఞానము ననుగ్రహించెను. అంతట నమ్ముని మిశ్రదేశమున (ఈజిప్టు) కేగి మ్లేచ్ఛులందరిని విద్యాబలముచే మోహపెట్టి అందు బదివేలమందిని దన శిష్యులను గావించుకొనెను. రెండు వేలమంది వైశ్యులను, మిగిలినవారిని శూద్రులను గావించుకొనెను. వారిం దీసికొని యార్యదేశమునకు సరస్వతీ ప్రసాదమువలన నేతెంచెను. ఆర్యసమూహములు దేవీప్రసాదమున గ్రమముగా నాలుగు కోట్లమంది స్త్రీపురుషులుగా వృద్ధిగాంచిరి. కాశ్యపుడే వారికి రాజయ్యెను. అతడు నూట యిరువది యేండ్లు పాలకుడయ్యెను//
చదివారు కదా..! దీన్ని ప్రత్యేకంగా విశ్లేషించవల్సిన అవసరం లేకపోయినా, శారదగారి వ్యాసం లోని కొంతభాగాన్ని తెనిగించుతున్నాను.

కలియుగం ప్రారభమైన వెయ్యేళ్ల తర్వాత..(కలియుగం క్రీ. పూ. 3102 ప్రాంతంలో ప్రారంభమైందని నిర్ధారించారు కదా..! అప్పటికి వెయ్యేళ్ల తర్వాత)..అంటే సుమారు క్రీ. పూ. 2000లో. కశ్యపముని, అర్యావతి బ్రహ్మావర్తానికి వచ్చారు. (బ్రహ్మావర్తం అంటే అఫ్ఘనిస్థాన్‌ ప్రాంతం అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా..!). కాశ్మీరంలోని సరస్వతిని (ఈ శక్తిపీఠం పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కి 150 కి.మీ దూరంలో ఉందని అంతర్జాలంలోనే ఎక్కడో చదివాను.!) ఆరాధించి, ఆశీస్సులు పొందారు.

వారి కొడుకులు ఉపాధ్యాయ్‌, దీక్షిత్‌, పాఠక్‌, శుక్లా, మిశ్రా, అగ్నిహోత్రి, ద్వివేది, త్రివేది, చతుర్వేది, పాండేయ్‌ (పాండే).. ఇవి ఉత్తరభారతంలోని బ్రాహ్మణుల గోత్రనామాలు (ఇంటి పేర్లు, surname) అని చాలామందికి తెలుసు.
ఆయన మిశ్రదేశానికి వెళ్లి అక్కడి మ్లేచ్ఛులను వశపరుచుకున్నాడు. పైన ఇచ్చిన "భవిష్య పురాణం" పుస్తకంలో మిశ్రదేశం అంటే ఈజిప్టు అని రాసారు గ్రంధకర్త. వారి దేశం గురించి ఈవిడేమీ ప్రస్తావించలేదు. కేవలం "మిశ్ర"..అంటే "mixed" అని వదిలేసింది. మరి ఆయన మిశ్రదేశాన్ని ఈజిప్టు అని ఎలా చెప్పారో తెలీదు.

వారిలో 10,000 మందిని ద్విజులుగా (బ్రాహ్మణులుగా), 2,000 మందిని వైశ్యులుగా, తక్కినవారిని శూద్రులుగా మార్చి, ఆర్యావర్తానికి వచ్చాడు. వారే.. "ఆర్యులు..". నెమ్మదిగా వారి సంఖ్య నలభై లక్షలుగా వృద్ధి చెందింది. కాశ్యపుడే వారికి రాజై 120 సంవత్సరాలు పరిపాలించాడు.
                ఆవిడ నిర్ధారణలు ఇంకా చాలా ఉన్నాయి. "అర్య".."ఆర్య"..రెండు వేర్వేరు శబ్దాలనీ, ఒకటి జాతినీ, ఇంకొకటి గుణాన్ని సూచిస్తుందనీ, ఏదో అలా సాగిపోయింది ఆ పరిశోధన. ఇంతకీ నేను చెప్పొచ్చేమిటంటే.. "నిజానిజాలు పెరుమాళ్లుకెరుక"...

ఈ వాదనలని ఖండిచేవీ, సమర్థించేవీ అనేక కథలూ, వాదాలూ "భవిష్య పురాణం"లో ఉన్నాయి. అవి తర్వాత పోస్టులో రాస్తాను.


(కొనసాగింపు)