మన సంస్కృతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మన సంస్కృతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జనవరి 2012, మంగళవారం

ఉత్తరాయణం - మకర సంక్రమణం


అందరికీ భోగి-సంక్రాంతి-కనుమ-ముక్కనుమ శుభాకాంక్షలు..! భోగి పండగ రోజునే వేద్దామనుకున్న ఈ టపాని ఆలస్యంగా ముక్కనుమ రోజున వేస్తున్నా... ఆలస్యానికి చింతిస్తూ..!

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతి జరుపుకోవడం మన ఆచారంగా అనాదికాలంగా వస్తోంది. ధనుర్మాసం ఆఖరి రోజు "భోగి" పండుగ. అప్పటివరకూ సూర్యుడు ధనూరాశిలో సంచరించి సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ ప్రారంభమౌతుందని భారతీయుల నమ్మకం. ఈ పండుగ రోజుల్లో పూజలూ, పిండివంటలూ, పతంగులూ మాత్రమే కాకుండా సరదాగా ఈ పండుగ వెనుక ఉన్న విజ్ఞానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం..! ఇంకొక ముఖ్యమైన విషయం.... ఇక్కడ రాసే విషయాలలో నాకు లోతైన జ్ఞానం లేకపోయినా, ఆసక్తికొద్దీ రాస్తున్నాను. తప్పులుంటే సరిదిద్దే ప్రయత్నం చేయగలరు...!

ఉత్తరాయణం అంటే "ఉత్తర దిశలో ప్రయాణం" అని అర్థం. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు ఒకసారి (అరునెలలు పాటు), ఉత్తరం వైపు ఒకసారి (ఆరు నెలలు) ప్రయాణిస్తాడు. అది అందరికీ తెలిసిందే. అందులో, ఉత్తరదిశలో ప్రయాణించే కాలాన్ని "ఉత్తరాయణం"గా, దక్షిణదిశలో ప్రయాణించే "దక్షిణాయణం"గా వ్యవహరిస్తున్నాం. "మకర సంక్రమణం" అంటే మకర రాశిలోకి ప్రవేశించడం. అయితే, సూర్యుని ఉత్తర దిశా గమనం, మకర సంక్రాంతి కన్నా 25(సుమారు) రోజులు ముందే మొదలైపోతుంది. అంటే "ఉత్తరాయణం" ముందే ప్రారంభమైనట్టు...!

ఋతువులు ఏర్పడే క్రమం గురించి మనకి ముందే తెల్సు కదా... ఈ క్రింది చిత్రం దానికి సంబంధించినదే..!

డిసెంబర్‌ 21/22 న సూర్యుడు మకరరేఖ (అంటే దక్షిణార్థ గోళంలో) ఉంటాడు. ఆరు నెలల తర్వాత అంటే జూన్‌ 20/21న కర్కాటకరేఖ (అంటే ఉత్తరార్థ గోళం)పైకి వస్తాడు. అంటే ఉత్తరంగా ప్రయాణించినట్టేగా..! అదే ఉత్తరాయణం ...! అలాగే మరో ఆరు నెలలు తిరిగేసరికి అంటే డిసెంబర్‌ 21/22కి మకరరేఖ పైకి వెళ్తాడు. అంటే దక్షిణంగా ప్రయాణించినట్టు., అది దక్షిణాయణం..! సంవత్సరంలో సూర్యుని కదలికలని(భూమికి సాపేక్షంగా) ఈ క్రింది చిత్రం స్పష్టతనివ్వవచ్చు..!


ఇక్కడ చెప్పేదేంటంటే, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం అనేది ఒక కొండ గుర్తు మాత్రమే..! నిజానికి ఉత్తరాయణం ఇంకా ముందే మొదలైపోతుంది. (తిలక్‌ ఆర్యవలస సిద్ధాంతాన్ని సమర్ధించిన విధంగా చూస్తే, ఉత్తర ధృవం వద్ద పగలు ప్రారంభమయ్యేది కూడా ఉత్తరాయణంలోనే అంటే డిసెంబర్‌ 20/21 తర్వాతనే..!) ప్రతీ యేడాదీ., సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడానికీ, ఉత్తరాయణం ప్రారంభం కావడానికీ మధ్యలో 50 సెకండ్ల తేడా పెరుగుతోదని, ఇప్పటి పరిశీలన..! మన జ్యోతిష్కులు వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు(ట).. అందుకే సంక్రాంతి, ప్రతీ 80 సంవత్సరాలకోసారి ఒకరోజు వాయిదా వేయబడుతూ వస్తోంది.

ఆర్యభట్టుని సూర్య సిద్ధాంతం ప్రకారం ఉత్తరాయణ ప్రారంభానికీ(డిసెంబర్‌ 21/22), సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడానికి మధ్యన ఉండే వ్యవధి గరిష్టంగా 27కి చేరి, ఆ తర్వాత తగ్గింపబడుతుంది (లేదా తగ్గిపోతుంది). ఈ లెక్క ప్రకారం 2294 సంవత్సరం తర్వాత మకర సంక్రాంతి ముందుకి జరుగుతూ వస్తుంది (80 ఏళ్లకోసారి..). కానీ ఇప్పటి ఆధునిక విజ్ఞానవేత్తల ఉద్దేశ్యం, అది అలా పెరుగుతూనే ఉంటుందని..!

సంక్రాంతికి ముందు రోజు అంటే భోగి రోజున మంటలు ఎందుకు వేస్తారు అనేదానిక్కూడా ఇక్కడే సమాధానం వెతుక్కోవచ్చు. ఉత్తరాయణ ప్రారంభం అయ్యే రోజుగానీ, ఆ ముందు రోజుగానీ, మొత్తం సంవత్సరంలో రాత్రిభాగం ఎక్కువగా ఉండే రోజు అవ్వడం వల్లన మంటలు వేసి పండగ మొదలుపెట్టడం వచ్చి ఉండచ్చు..! అయితే, ముందు చెప్పినట్టు ఉత్తరాయణ ప్రారంభం డిసెంబర్‌ 21/22 అవ్వడం వల్ల, సంక్రాంతి ఎక్కువ రాత్రి భాగం ఉందే రోజు అవ్వదు..! ఇప్పుడంటే, డిసెంబర్‌ 21/22 అని ఉత్తరాయణ ప్రారంభం(Winter solistice) గురించి సులువుగా చెప్పేస్తున్నాంగానీ, 200 సంవత్సరాల క్రితం సరిగ్గా చెప్పే విధానం జనంలో వాడుకలో లేదు కదా..! మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అంటే ఖచ్ఛితంగా ఉత్తరాయణం మొదలైపోయిందని నిర్ధారించేసుకోవచ్చు కనక, మకర సంక్రమణం వరకూ ఆగి, అప్పుడు పండగ మొదలుపెట్టి ఉండవచ్చు..! సరే..! ఈ లెక్కన దక్షిణార్థగోళంలోని వారు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలేండ్‌, దక్షిణ ఆఫ్రికా లాంటి చోట్ల మకర సంక్రాంతికి బదులు కర్కాటక సంక్రాంతి (జూన్‌ జూలైల దగ్గర) జరుపుకోవాలేమో..!

References:

16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఇంద్ర ప్రస్థం - కొన్ని సంగతులు




మహాభారత కాలం నుండీ భారతదేశానికీ, దేశ ప్రజలకు "" "మనది" అనిపించుకునే అతి కొద్ది నగరాలలో ఢిల్లీ ఒకటి.. గత ఐదువేల సంవత్సరాలుగా (మధ్య మధ్యలో విరామాలను వదిలేస్తే) భారతీయులకి సిసలైన రాజధానీ నగరం నేటి కొత్త ఢిల్లీ.. అదే ఒకప్పటి ఇంద్ర ప్రస్థం..

కొత్త రాజధాని నిర్మాణానికి ఇంగ్లాండు రాజ దంపతులు శంకుస్థాపన చేసి, నిన్నటికి సరిగ్గా వందేళ్లు గడిచింది..!

ఢిల్లీ నగరం భారతదేశ రాజధానిగా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, నగరానికి సంబంధించిన (కొన్ని) విషయాల సేకరణే ఈ టపా..!

1) "ఢిల్లీ" అనే పేరు గురించి చెప్పుకోవాలంటే, భవిష్య పురాణంలోని కథని ని చెప్పకతప్పదు. ఇంద్ర ప్రస్థ పాలకుడైన పృథ్వీ రాజు., చతుర్వర్ణ నివాసమైన కోటనొకదాన్ని నిర్మించి, దానికి "దేహలి (హిందీలో గుమ్మం)" ఏర్పాటు చేసాడట..! ఈ "దేహలీ" శుభసూచకంగా అనిపించి ఆ ఊరికి "దేహలి" అని పేరు పెట్టాడట. అదే కాలక్రమాన "దిల్లీ" గా మారింది. పృథ్వీ రాజ్‌ చౌహాన్‌ నిర్మించిన "దేహలీ" పురం నేటి "పురానా ఖిలా" ప్రాంతం అంటారు. అంటే పాత ఢిల్లీ. ఒకప్పటి ఇంద్రప్రస్థం శిథిలమైపోగా అదే ప్రదేశంలో బ్రిటీషువారు నిర్మించిన నగరం నేటి కొత్త ఢిల్లీ..అదే మన రాజధానీ నగరం..

2) దేహలీ, ఇంద్రప్రస్థం నిజానికి వేర్వేరు ఊళ్లు... మద్రాసపట్టణం - చెన్నపట్టణం, హైదరాబాదు-సికిందరాబాదు లాగే జంట నగరాలు (మా కాకినాడ కూడా ఒకప్పుడు కాకినాడ- జగన్నాధపురం జంట పట్టణాలుగా ఉండేదట..!). అవి రెండూ కలిసి పోయాయి. ప్రస్తుతం రాష్ట్రపతి భవనం ఉన్న ప్రాంతమే ఒకప్పటి ఇంద్రప్రస్థమని స్థానిక ప్రజల నమ్మకం. మంచిదే కదా..!.

3) కొంతమంది అంటూ ఉంటారు. ఢిల్లీ ఒకప్పటి హస్తినాపురమని..! కానీ అది తప్పు.....హస్తినాపురం, ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ జిల్లాలో ఉంది, ఢిల్లీ నుండి సుమారు 70 కి.మీ దూరంలో. అయితే తప్పులో ఒప్పు ఏంటంటే. ఈ గ్రామం "జాతీయ రాజధాని ప్రాంతం(National Capital Region - NCR)"లోకే వస్తుంది. అందువలన మన రాజధాని "హస్తిన" అనడం అంత పెద్ద తప్పేమీ కాదేమో..! రాయబార సమయంలో పాండవులు కోరిన ఊర్ల జాబితాలో ఇంద్ర ప్రస్థం కూడా ఉందని మనకు తెలుసు. మిగిలిన నాలుగు ఊళ్లలోని ప్రముఖమైన ఊళ్ళు . పానీపట్‌ (పాండు ప్రస్థం), సోనీపట్‌ (స్వర్ణ ప్రస్థం), వారుణా వతం, కూడా జాతీయ రాజధాని ప్రాంతాని(NCR)కి చేరువలోనో, చేర్చేసో ఉన్నాయి.

4) ఢిల్లీ పరిసర ప్రాంతమైన గురుగావ్‌ (హరియాణ) కురు-పాండవులు ద్రోణుడి వద్ద విద్యాభ్యాసం చేసిన ప్రదేశంగా చెబుతారు. అందుకే గురుగ్రామం, గురుగావ్‌ అయిందట..! మరి శిక్కులకేమన్నా సంబంధం ఉందేమో మరి..! "భారత్‌" అనే మనదేశ నామానికి భారతానికి చాలా సంబంధం ఉందనిపిస్తోంది కదా..!

5)1947 దేశవిభజన సమయంలో ఢిల్లీ జనాభా రెండు రెట్లు పెరిగిందని అంటారు. అప్పటి ఢిల్లీ జనాభా సుమారు 7 లక్షలు వరకూ ఉండగా., 1-2 లక్షల మంది పాకిస్థాన్‌ కి తరలి వెళ్ళిపోగా, కొత్తగా 8 లక్షల మంది పాకిస్థాన్‌ ప్రాంతం నుండి ఢిల్లీలోకి ప్రవేశించారట..! మహాభారత కాలంలో కూడ ద్వారక మునిగిపోతే, పోయినవారు పోగా, మిగిలిన వారికి పాండవులు ఆశ్రయం కల్పించింది కూడా ఇంద్రప్రస్థం లోనే..! పాకిస్థాన్‌ నుండి వచ్చిన హిందువులు కావచ్చు, కాశ్మీరు పండితులు కావచ్చు, తాలిబన్‌ పాలనలో అక్కణ్ణుండి నుండి పారిపోయిన అఫ్ఘన్‌ హిందువులు కావచ్చు, కొంతమంది టిబెటన్లు కావచ్చు... నిరాశ్రయులైన ఎంతోమందికి పునరావాసం కల్పించిన.. కల్పిస్తున్న నగరం., అంతమందినీ తనలో ఇముడ్చుకుంటున్న నగరం మన రాజధాని. ఈ సంప్రదాయాన్ని (మనుషులకే ఉండాలా..?) మహాభారతకాలం నుండీ కొనసాగిస్తోంది ఢిల్లీ...!

6)రాజధానిగా ఢిల్లీ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖా మాంత్రిణి. కుమారి సెల్జా అన్న మాట "ఢిల్లీ చరిత్రలో ఏడు సార్లు నాశనం చేయబడి-మళ్లీ నిర్మింపబడింది. ఇప్పుడున్న ఢిల్లీ ఎనిమిదో సారి నిర్మింపబడిన నగరం". అదేదో ఫీనిక్స్‌ పక్షిలాగ..!

7) నాశనం అనే పదం వింటే, ఎవ్వరికైనా గుర్తు రావల్సింది ఢిల్లీ నగరమే..! 13వ శతాబ్దంలో తైమూర్‌ లంగ్‌ (తిమిర లింగుడు - భవిష్య పురాణం ప్రకారం) ఢిల్లీ మీద చేసిన దండయాత్ర, మానవ చరిత్రలోనే అత్యంత క్రూరమైనది భావించబడుతూ ఉంటుంది. తైమూర్‌ లంగ్‌ అంతలా నాశనం చేసినా ఢిల్లీ మళ్ళీ నిలబడగలిగింది, అంతేగాకుండా రాజ్యభ్రష్టుడై దేశదిమ్మరిలా తిరుగుతున్న అతని మనుమడు బాబర్‌ కి,అతని సైన్యానికీ ఆశ్రయం కల్పించింది. అపకారికి ఉపకారం చేయడం అంటే ఇదే..! అటుపైన వారు చేసిన విధ్వంసం జగమెరిగినదే..!

8) కొత్త ఢిల్లీ రాజధాని అయిన దగ్గర్నుండి భారతీయులు అన్ని రంగాలలోనూ విజృంభించారు. అప్పటి వరకూ లేని స్వాతంత్ర్య కాంక్ష జనంలోకి బాగా వ్యాపించినా, గాంధీ దేశ నాయకుడి గుర్తింపబడినా, రవీంద్రనాధ్‌ టాగూర్‌ ని నోబుల్‌ ప్రైజు సాధించి బోణీ కొట్టినా, అన్నీ కూడా కొత్తఢిల్లీ రాజధాని అయిన తర్వాతే..! (ఇలా మాట్లాడితే పృథ్వీరాజు దేహలీ పురాన్ని నిర్మించడం వల్లనే ఘోరీ మహమ్మద్‌ చేతిలో ఓడిపోయాడేమో అనిపిస్తూ ఉంటుంది. శతాబ్దాల భారతీయ బానిసత్వానికి అదే అరంభం కదా..!). రాజధాని వాస్తు గురించి ఎక్కువగా అలోచించకపోతేనే మంచిదేమో..!




ఇవి, ఢిల్లీ. . దిల్లీ . . . దేహలీ . . . ఇంద్రప్రస్థానికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని సంగతులు....కొన్ని భావాలూ....కొన్ని నమ్మకాలూ..!
.............................
ఢిల్లీ భారతదేశ రాజధానిగా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా..!

1, నవంబర్ 2011, మంగళవారం

ఒక సంస్కృత అద్భుత కావ్యం గురించి..



                         "ఫేస్‌ బుక్‌" చూస్తూండగా  మధ్యలో తగిలిన ఫోటో ఇది. బహుశా, ఎవరిదో పుస్తకం నుండి కాపీ చేసి పెట్టి ఉంటారు. సారాంశం మాత్రం అద్భుతం. ఆసక్తికొద్దీ నా బ్లాగులోకి తీసుకువచ్చాను.



ఆ కావ్యానికి సంబంధించిన లింకు

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

తెలుగు - నెలలు, సంవత్సరాలు, అంకెలు


           మనం మర్చిపోయిన తెలుగుని అంటే వాడుక పదాలనీ, జాతులవారినీ, కులాలూ,కుటుంబాలవారినీ మళ్లీ మనకి గుర్తుచేసేందుకే "నుడి"..ని మొదలుపెట్టిన ఆంధ్రభూమివారు నిజంగా అభినందనీయులు...! ఆంధ్రభూమి "నుడి"లో వచ్చిన వ్యాసం ఆధారంగా తెలుగు నెలల గురించి ఈ పోస్ట్‌ రాద్దామనుకుని.., అందరికీ తెలిసినవైనా తెలుగు సంవత్సరాలనీ, అంకెలనీకూడా జతపరచేస్తున్నాను...! అయితే, ఈ పోస్ట్‌ ప్రధాన ఉద్దేశ్యం నా మిత్రులకి తెలుగు నెలలు పరిచయడమేనని ఇంకోసారి మనవి చేస్తున్నాను.
అందుకు సంబంధించిన లింకు ఇదిగో..
తెలుగు నెలలు
చైత్రము ----------ముంగాపి, ముందాపి
వైశాఖము--------కొంగాపి, కందాపి
జ్యేష్ఠం------------ఒల్లాపి
ఆషాఢము-------కట్లాపి
శ్రావణము--------సెవ్వాపి
భాద్రపదము------ముంగనాపి
ఆశ్వయుజము----కుదునాపి, కుందాపి
కార్తీకము----------జీరాపి
మార్గశిరము------ ఈరాపి
పుష్యము----------తైందాపి
మాఘము---------ఏరిమాపి
ఫాల్గుణము--------ఏగాపి, కడాపి
ఒకప్పుడు అంటే సుమారు వందేళ్ల క్రితం వరకూ, మన తెలుగునాట పేర్లు వాడుకలో ఉండేవట.. ప్రస్తుతం, తమిళనాడులో పాత ఉత్తర,దక్షిణ ఆర్కాట్జిల్లాలూ, తిరువణ్ణామలై జిల్లాలోనూ పెద్దసంఖ్యలో ఉన్న తెలుగు కుటుంబాల్లో ఇంకా వాడుకలో ఉన్నాయి..! (ఆంధ్రభూమి "నుడి" సౌజన్యంతో)

తెలుగు సంవత్సరాలు
1. ప్రభవ,
2.
విభవ,
3.
శుక్ల,
4.
ప్రమోదూత,
5.
ప్రజోత్పత్తి,
6.
అంగీరస,
7.
శ్రీముఖ,
8.
భావ,
9.
యువ,
10.
ధాత,
11.
ఈశ్వర,
12.
బహుధాన్య,
13.
ప్రమాధి,
14.
విక్రమ,
15.
వృష,
16.
చిత్రభాను,
17.
స్వభాను,
18.
తారణ,
19.
పార్థివ,
20.
వ్యయ,
21.
సర్వజిత్తు,
22.
సర్వధారి,
23.
విరోథి,
24.
వికృతి,
25.
ఖర,
26.
నందన,
27.
విజయ,
28.
జయ,
29.
మన్మథ,
30.
దుర్ముఖి,
31.
హేవళంబి,
32.
విళంబి,
33.
వికారి,
34.
శార్వరి,
35.
ప్లవ
36.
శుభకృత్తు,
37.
శోభకృత్తు,
38.
క్రోథి,
39.
విశ్వావసు,
40.
పరాభవ,
41.
ప్లవంగ,
42.
కీలక,
43.
సౌమ్య,
44.
సాధారణ,
45.
విరోధికృత్తు,
46.
పరీధావి,
47.
ప్రమాదిచ,
48.
ఆనంద,
49.
రాక్షస,
50.
నల,
51.
పింగళ,
52.
కాళయుక్తి,
53.
సిద్ధార్థి,
54.
రౌద్రి,
55.
దుర్ముఖి,
56.
దుందుభి,
57.
రుధిరోద్గారి,
58.
రక్తాక్షి,
59.
క్రోధన,
60.
అక్షయ.
తెలుగు అంకెలు
౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯
0 1 2 3 4 5 6 7 8 9
తెలుగు సంవత్సరాలు ఇప్పటికే వాడుతున్నా, తెలుగు అంకెలు మళ్లీ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టా, తెలుగు నెలలని వాడడం కూడా మొదలుపెడదామనుకుంటున్నా..! మీరూ మొదలుపెట్టండి..!

30, ఆగస్టు 2011, మంగళవారం

కాలెండర్‌- సంస్కృత, భారతీయ మూలాలు

సురేష్‌గారి పాత బ్లాగుల్లో ఎక్కడో ఆయన "hour"...అనే ఇంగ్లీషు పదానికి మూలం సంస్కృత పదమైన "హోర.."..అని చెప్పగానే.., నాక్కూడా ఇలాంటి పోస్టొకటి రాయలనిపించింది... భారతీయులు ప్రపంచానికందించిన వాటిల్లో గణితం, "0"...లే కాకుండా.., కాలగణన కూడా ఉందని నా అభిప్రాయం. అందుకు సంబంధించిన విషయాలు నేను కుముదం భక్తి పుస్తకంలోనో, ఋషి పీఠం పుస్తకంలోనో చదివినట్టు గుర్తు... వాటినే రాయాలనుకుంటున్నాను....
ముందుగా రాయబోయేది కాలెండర్‌ అనే పదం గురించి... "కాలెండర్‌"...అనే ఇంగ్లీషు పదం "kalendae" అనే లాటిన్‌ నుండి వచ్చిందని వికీపీడియా వ్యాసంలో ఉంది. నేను పైన చదివిన పత్రికల్లో దీని గురించిన ప్రస్తావన వచ్చింది. అసలీ "కాలెండర్‌"..కి మూలం "కాలంధర"..అనే సంస్కృత పదం..! కాలంధర అంటే, కాలాన్ని ధరించునది అని అర్థం.. అంటే కాలెండర్‌ని మనం ఏ విధంగా డిఫైన్‌ చేయవచ్చంటే , కాలాన్ని ధరించే ఒక కాగితం ముక్కగా..!
ఆంధ్రభూమిలో ఒక వ్యాసంలోని భాగం యధాతధంగా కాపీ చేస్తున్నాను...ఇక్కడ చూడండి..


// మీకో విషయం తెలుసా? మనం వినియోగిస్తున్న ఇప్పటి ఇంగ్లీష్ ‘గ్రెగోరియన్’ క్యాలెండర్‌కు పూర్వం అంటే క్రీ.శ.1739 సంవత్సరానికి పూర్వం, పాశ్చాత్యులు కూడా మార్చి ‘25వ తేదీనే- నూతన సంవత్సర ప్రారంభంగా చేసుకునేవారు. దానిని, తర్వాత జనవరి ఒకటికి మార్చుకున్నారు. మార్చి 25 అనే తేదీ, నిజానికి మన ఉగాదికి దగ్గరగా వుండేది. ‘వారం’అంటే ‘పర్యాయం’ అనే అర్థం వుంది. ‘స్మరవారం వారం’ అంటే పర్యాయాలుగా తలుచుకోవడం. ‘వబయోరభేదః’ అని, ‘వ’ని ‘బ’గా సూచించడం వుంది. అప్పుడు- మార్చి వారికీ సంవత్సరాది కనుక, అక్కడనుండి సప్తమ పర్యాయం అంటే సప్తమవారం- ‘సెప్టెంబర్’గా, అష్టమ వారం అష్టబార్ అనేది ‘అక్టోబర్’గా, నవమ అనగా 9వ నెల ‘నవంబర్’గా, దశమవారం 10వ నెల డిసెంబర్- డిసెంబర్’గా పేర్కొనబడేదన్నమాట! జనవరిని కొత్త సంవత్సరం చేసుకున్నాక- సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9,10,11,12 నెలలుగా మారినా, వారు పేర్లు మార్చుకోలేకపోయారని మాన్యులు తెలకపల్లె విశ్వనాధశర్మగారు కాలంధర విజ్ఞానం గురించి చెబుతూ పంచాంగం ప్రాముఖ్యం గురించిన వ్యాసంలో పేర్కొన్నారు.//
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, ప్రపంచానికి కాలగణన నేర్పింది భారతీయులేనని కూడా అనిపించకమానదు. దానికి సంబంధించిన విషయం పైన కాపీ చేసిన పేరాలో ఉంది. దానికి ఇంకోటి జత చేయబోతున్నాను. "ఆగస్టు" ఒకప్పుడు "Sextilis"..అని పిలవబడేదట...వికీపీడియాలోని ఈ వ్యాసంలో చూడొచ్చు... ఈ పదం మన సంస్కృతంలోని "షష్టి.."..అనే శబ్దానికి దగ్గరగా ఉందనే నాకనిపిస్తోంది..

ఇంక మార్చి 25 ఒకప్పటి సంవత్సరాది అని చెప్పడానికి ఇంకో ఋజువు ఏంటంటే.., ఆ "కాలెండర్‌"లోని అఖరి నెల అయిన ఫిబ్రవరికే సవరణలు జరుగుతూ ఉంటాయి..అంటే సాధారణంగా 28 రోజులు ఉండి, లీపు సంవత్సరంలో 29 రోజులు ఉండడం. ప్రతీ వందేళ్లకొకసారి అది ఉండకపోవడం..అందులోనూ ప్రతీ నాలుగొందల సంవత్సరాలకీ మళ్లీ ఉండడంలాంటివన్నమాట..అంటే 2000 లీప్‌ సంవత్సరం, 1900, 2100, 2200. 2300 లీప్‌ సంవత్సరాలు కాదు..మళ్లీ 2400 లీప్‌ సంవత్సరం అన్నమాట..ఇదంతా వేరే గొడవ..!
ఇంక సురేష్‌గారు ప్రస్తావించిన హోర దగ్గరకి వద్దాం..! దీని గురించి నాకన్నా పంచాంగ కర్తలు బాగా చెబుతారు.. అయినా నాకు తెలిసిన దాన్ని రాద్దామనుకుంటున్నాను.. మన కంటికి కనిపించే గ్రహాలు తొమ్మిది. ఇవి నిజానికి భూమిచుట్టూ తిరగకపోయినా సాపేక్షంగా తిరుగుతున్నట్టే జ్యోతిష్కులు లెక్కలోకి వేసుకుంటారు. ఇవి మనకు తెల్సినవే.. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు...! రాహువు, కేతువు ఛాయాగ్రహాలు, భౌతిక పదార్థంగా లేవు కాబట్టి లెక్కలో రావు.. ఇంక మిగిలిన ఏడు గ్రహాలనే "హోర" చక్రంలో తీసుకున్నారు మన పూర్వీకులు. ఈ ఏడు గ్రహాలూ ఒక చక్రంలో ఒక "హోర" కాలం (అంటే ఒక గంట సేపు)..భూమి మీద ప్రభావం చూపిస్తాయని నమ్మిక..ఈ హోరాచక్రం అలా రిపీట్‌ అవుతూనే ఉంటుంది...
దీని గురించిన చక్కని వివరణ సత్యనారాయణశర్మ గారి బ్లాగులో ఉంది.. దాని లింక్‌ ఇదిగో...

 సూర్యోదయం అయ్యే సమయంలో, ఏ గ్రహప్రభావమైతే భూమిమీద ఉంటుందో, ఆ రోజుని, ఆ వారంగా పరిగణిస్తారు. సూర్యోదయ సమయంలో, ఆదివారం సూర్యుడి ప్రభావం ఉంటుంది, సోమవారం చంద్రుడి ప్రభావం..ఇలా అన్నమాట...! కనుకనే మనకి వారంలో ఏడు రోజులున్నాయి... సన్‌డే, మన్‌డే, ట్యూస్‌డే,వెన్స్‌ డే..ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న ఏడు గ్రహాల లాటిన్‌ రూపాలే..! వాటి లిస్ట్‌ కింద రాసాను
 


sunday........... ఆదివారం.... సూర్యుడు...sun
monday.........సోమవారం.....చంద్రుడు...moon
tuesday........మంగళవారం....కుజుడు...mars
wednesday.....బుధవారం.....బుధుడు...mercury
thursday.......గురువారం....బృహస్పతి..jupiter
friday..............శుక్రవారం.....శుక్రుడు..venus
saturday.........శనివారం.........శని...saturn
ఇంగ్లీషులో వారాలపేర్ల గురించి,అయా గ్రహాల లాటిన్‌ పేర్ల గురించి ఆయా వికీపీడియా వ్యాసాల్లో అందుబాటలో ఉన్నాయి.. ఇకపోతే, మన జ్యోతిషశాస్త్రం అంతా ఉజ్జయినీ నగరాన్ని ప్రామాణికంగా తీసుకుని గణింపబడిందని విన్నాను.. విజ్ఞలు దీనిపై పరిశోధనలు కూడా చెయ్యొచ్చు..! పనిలో పనిగా మధ్యలో మా కాకినాడ గురించి డబ్బా కొట్టుకోవలసిన విషయం ఒకటుంది..! భారత ప్రామాణిక రేఖాంశం 82 1/2 ..కాకినాడ చాలా దగ్గరనుండే పోతుంది.. అంటే, మా కాకినాడ టైంనే..భారతదేశం మొత్తం వాడుతోందన్నమాట..!
రోజుకు 24 గంటలనే కాన్సెప్ట్‌ కూడా భారతీయులదే..! అది హోరలకి సంబంధించినదేగా మరి..! ఆదివారం సర్యోదయం నాడు సూర్యుడితో మొదలైన హోరాచక్రం..మళ్ళీ ఆదివారం సూర్యోదయం వరకూ ఉంటుందన్నమాట..! అందుకే మన భారతీయుల వారం ర్యోదయంతో మొదలై మరుసటిరోజు సూర్యోదయం వరకూ ఉంటుంది.. రోజు మారడమనేది సూర్యోదయం మీదే ఆధారపడి ఉంది. అందరూ అనుకుంటునట్టు అర్థరాత్రి 12 గంటలకి వారం మారదు..!
సందర్భం కాకపోయినా, ఈ విషయం రాయాలనిపిస్తోంది.. అదేంటంటే, మన పురాణాల్లో యవనులు కూడా భారతీయులేనని ఉంది. వీళ్లే, ఆ తర్వాత, గ్రీస్‌ ప్రాంతాన్ని, ఇటలీ ప్రాంతాన్ని ఆక్రమించారని ఉంటుంది. వాళ్లు అక్కడ నిర్మించుకున్న నగరం పేరు "రామ నగరమని..".. వాళ్లని రామకులని..పిలవడం జరిగింది.. అదే రోమ్‌ అనీ.., వాళ్లు రోమన్స్‌ అనీ, ఎక్కడో చదివాను.. (ఇక్కడింకో విషయం.., ఈ లెక్క ప్రకారం సోనియా గాంధీ కూడా భారతీయురాలే..!బిజెపి వాళ్లూ, ఆరెస్సెస్‌వాళ్లూ అనే "విదేశీ"..పదం తప్పన్నమాట..!). ఈ వాదాన్ని మాక్స్‌ ముల్లర్‌ పేర్లు కలవడం లేదనీ, అదనీ, ఇదనీ,, చాలా సిల్లీ వాదాలతో కొట్టిపారేసాడని గుర్తు.. అయితే, పూర్తిగా తెలీదు..! సంస్కృతానికీ, లాటిన్‌కీ ఉన్న సంబంధం ఇక్కడే ఉందని, నా అభిప్రాయం...!

11, జులై 2011, సోమవారం

అనంత సంపద

అనంత పద్మనాభుని అనంత సంపద గతకొద్దికాలంగా, ప్రపంచ మీడియాని ఆకర్షించిన సంగతి అందరికీ తెలిసినదే..! లక్షకోట్లని, ఐదు లక్షల కోట్లని, కోటి కోట్లనీ ఎవరికి తోచిన లెక్కలు వాళ్లు చెప్పేస్తున్నారు. ఈ లెక్కలన్నీ నిజమైనవి కావని చాలామందికి తెలుసు. అసలైన విలువ ఎంతో, సంబంధిత వ్యక్తులుగానీ, వ్యవస్థగానీ అధికారికంగా ప్రకటించే వరకు దేన్నీ నమ్మడానికి లేదు.
ముందుగా లెక్కలు తేలుద్దామని దిగిన సుప్రీం కోర్టు కమిటీవారు, కొంతకాలం ప్రయత్నించి వాళ్ల తరం కాదని తేల్చేసి, మా పని లిస్టు తయారుచెయ్యడం మాత్రమేనని చెప్పేసారు. సో, సుప్రీం కోర్టు లెక్కలు తేల్చమని ఈ కమిటీనే మళ్లీ అదేశించవచ్చు, లేదా ఇంకో కమిటీ వెయ్యవచ్చు లేదా ఆ రాజకుటుంబాన్నే కోరవచ్చు. అయితే, తిరువాన్కూర్‌ రాజకుటుంబం అది దేవుని సంపద అని, తాము ముట్టుకోబోమని ఇప్పటికే చెప్పియున్నారు. వాళ్లు లెక్కలు చెప్తారని ఆశించడకూడదు. బహుశా వారిని ఎవ్వరూ అడగకపోవచ్చు కూడా..! పైగా వాళ్లకి లెక్కపెట్టే ఉద్దేశ్యమే లేదు. ఎందుకంటే, సంపద విషయాన్ని రహస్యంగా ఉంచమని కోరియున్నారు.
ఏది ఏమైనా..భారతజాతి గర్వించే పురావస్తు సంపదను ఇంతకాలం సంరక్షించినందుకు, రహస్యంగా ఉంచినందుకు, అన్నింటికన్నా ముఖ్యంగా తమ స్వంత ప్రయోజనాలకు ఉపయోగించనందుకు వారికి నా వందనాలు.. ఆ దేవాలయం నుండి ధూళి కూడా వెంట తెచ్చుకోకూడదన్న నియమంతో గుడిని దర్శించిన తర్వాత కాళ్లు శుభ్రపరుచుకునే సంప్రదాయాన్ని పాటించడం, అప్పటివాళ్లకు అది అర్థం కాకపోయిన కనీసం మనతరానికి అర్థమైనందుకు సంతోషంగా ఉంది. ఆ రాజకుటుంబం మొత్తానికి, భారతజాతి మొత్తం ఋణపడి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు..
ఆ సంపదని ఇలా వినియోగించాలని, అలా వినియోగించాలని ఎవరికి వాళ్లు ఐడియాలిచ్చేస్తున్నారు. దాన్ని పురాతత్వ మరియు వారసత్వ సంపదగా గుర్తించిన వారు బహుతక్కువ. వారసత్వం అంటే పెద్దవాళ్లు గడ్డిపరక ఇచ్చినా దాన్ని జాగ్రత్త చేసుకోవలసిందే..! లేకపోతే వారికి మనమిచ్చే విలువ ఏమిటి.?
ఆ సంపదని పేదవాళ్లకి పంచిపెట్టలనే వాళ్లకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను..మీరు అంత పేదవారి పక్షపాతి అయితే మీ సొంతసంపాదన నుండి కొంతమందైనా పేదవాళ్లని చదివించండి..లేదా వాళ్లకి జీవనోపాధి కల్పించండి.. అందుకు డబ్బులు అవసరమైతే మీ అంతట మీరు కష్టపడండి..అంతేకానీ దేవుని సంపద, అందునా వారసత్వ సంపద, మీద దృష్టి పెట్టడం అష్టదరిద్రాలకన్నా ఘోరం.
ఇటువంటివాళ్లందరూ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. బాబా రాందేవ్‌ లెక్కల ప్రకారం సుమారు 400 లక్షల కోట్ల నల్లధనం విదేశాల్లో మూలుగుతోంది. ఆయన లెక్కలు కరెక్టా.? కాదా.? అనే డిస్కషన్‌ ఇక్కడ అనవసరం..ఎందుకంటే..! అంత కాకపోయినా, ఎంతో కొంత నల్లడబ్బు బయటి దేశాల్లో ఉందన్నది అందరికీ తెలుసు. ఆ డబ్బుతో పోలిస్తే పద్మనాభుడి సంపద చాలా తక్కువ. ముందు పోయి నల్ల డబ్బు మీద పడండి..! ఆ ధైర్యంలేకపోతే నోరుమూసుకు కూర్చోండి.

24, మార్చి 2010, బుధవారం

రామ సేతు

రామ సేతు ను దేశ భద్రతాకారణాల దృష్ట్యా కూల్చాలని కేంద్రం తలపోయడం వివాదాస్పదం ఐన సంగతి అందరికి తెల్శిందే....
కాని ఇక్కడ పరిశీలించవలసిన విషయం ఏంటంటే....తాము అభ్యుదయవాదులమని అని ప్రకటించుకొనే వాళ్ళందరూ..
సమయం దొరికింది కదా అని అదే పనిగా రామున్ని అవమానిచడం...సభ్యత అనిపించుకోదు...
రాముడా? అతనెవరు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎ విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ చదివాడు? లాంటి అర్థం పర్థం లేని ప్రశ్నలు సంధించడం... వాళ్ళ దివాలకోరుతనాన్ని సూచిస్తోంది....దేశంలో అత్యదిక సంఖ్యాకులకి ఆర్ధ్య దైవమైన రాముడికి చెప్పుల దండలు వేసినవాళ్ళకి ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు రావడం వింతేమీ కాదు....
కేంద్రం కూడా వాదనల్లో ప్రజల మనోభావాలని కించపరిచేలా వ్యవహరించడం బాధాకరం
.... చివరకి అఫిడవిట్ ను ఉపసంహరించు కోవడం ఆనందపరిచింది.....

దేశ భద్రతే లక్ష్యంగా చిత్తశుద్ధితో కేంద్రం వ్యవహరించి ఉంటే...ఇంత రగడ జరిగేది కాదు....బహుశా.రాముడే ఇపుడు ఉంది ఉంటే ఆ ప్రాజెక్ట్ కి అనుమతించి వుండే వాడు....ప్రజలు నిండు మనసుతో స్వాగతించే వాళ్ళు....
కాని కేంద్రం రాముడే లేదని వాదించింది....చారిత్రక అధరాలు లేవంది...
ఇక్కడ ఒక గుర్తు చేసుకోవాలి.....మన చదువుకొన్న మన చరిత్ర...మనం రాసుకొంది కాదు....ఇంగ్లీష్ వాళ్ళు రాసింది...!
ఎవడో బయటి వాడు చెప్పింది చదువుకొని మనల్ని మనమే కించపరుచుకొంటున్నాం... కొట్టుకుంటున్నాం....


'అవతార్' సినిమా లో గాలిలో తేలే రాళ్ళు ఉంటాయటే నమ్మే మనం సముద్రం మీద రాళ్ళూ తేలతాయంటే నమ్మడం ledu ...

ఇప్పటికైనా మన నాయకులు ప్రజల్లో ఉన్న ఆత్మ న్యూనతా bhaavanni tholaginchadani ప్రయత్నిస్తే మంచిది....